మండలి రద్దుకు అసెంబ్లీ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ అంసెబ్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. శాసనమండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ అమోదించింది.
ఆంధ్రప్రదేశ్ అంసెబ్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. శాసనమండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ అమోదించింది. మండలి రద్దుపై తీర్మానం సీఎం జగన్ శాసనసభలో ఉదయం తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం సభలో దీనిపై సభ్యులు చర్చించారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారమ్ ఓటింగ్ నిర్వహించారు. మండలి రద్దుకు అనుకూలంగా 133 ఓట్లు ఉన్నట్లు తేల్చారు. వ్యతిరేకంగా ఎవరూ లేరని స్పీకర్ ప్రకటించారు. అనంతరం శాసన మండలి రద్దు తీర్మానం ఆమోదం పొందినట్లు స్పికర్ ప్రకటించారు. అనంతరం శాసనసభను నిరవధిక వాయిదా వేశారు.