Train Accident: రైలు ఢీకొని ఇద్దరు మృతి
Train Accident: అన్నమయ్య జిల్లా కలికిరి రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది.
Train Accident: రైలు ఢీకొని ఇద్దరు మృతి
Train Accident: అన్నమయ్య జిల్లా కలికిరి రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదానికి ముందు మృతులు స్టేషన్ అధికారులతో గొడవ పడి రైల్వే పట్టాలపై కూర్చుని మద్యం తాగారు. అదే సమయంలో వేగంగా వచ్చిన ఎక్స్ప్రెస్ రైలు వారిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. మృతులు చిత్తూరు జిల్లాకు చెందిన మునికుమార్, అన్నమయ్య జిల్లాకు చెందిన వీరభద్రయ్యగా రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.