ఎన్టీఆర్ జిల్లాలో జాతీయరహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
ఎన్టీఆర్ జిల్లాలో జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం అయ్యింది.
ఎన్టీఆర్ జిల్లాలో జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం అయ్యింది. కంచికచర్ల మండలం కీసర గ్రామ సమీపంలో ఘటనలో చోటు చేసుకుంది. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ 39 మంది ప్రయాణికులు. బస్సు వెనుక నుంచి పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తం అయ్యి రోడ్డుపక్కన నిలిపారు. వెంటనే ప్రయాణికులు కిందకు దిగడంతో భారీ ప్రమాదం తప్పినట్టయ్యింది. నేషలన్ హైవే సిబ్బంది బస్సులో మంటలు అదుపు చేశారు.