'పులిచింతల ప్రాజెక్టు వద్ద 45 అడుగుల వైఎస్సార్ విగ్రహం'
‘పులిచింతల ప్రాజెక్టు వద్ద 45 అడుగుల వైఎస్సార్ విగ్రహం’ ‘పులిచింతల ప్రాజెక్టు వద్ద 45 అడుగుల వైఎస్సార్ విగ్రహం’
పులిచింతల ప్రాజెక్టు వద్ద దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ తెలిపారు. 'పులిచింతల జల హారతి' కార్యక్రమంలో మంత్రి అనిల్ కుమార్ తోపాటు రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు నంబూరి శంకర్ రావు, జోగి రమేశ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, చీరె, సారెలను సమర్పించారు మంత్రులు.
అనంతరం పులిచింతల ప్రాజెక్టును ఈ బృందం పరిశీలించింది. ఈ సందర్బంగా మంత్రులు మాట్లాడుతూ.. పులిచింతల ప్రాజెక్టు వద్ద సుమారు 45 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఆయనతో పాటు కెఎల్ రావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడేస్మృతి వనం, పార్కును కూడా నిర్మించనున్నట్టు మంత్రులు తెలిపారు. అంతేకాదు గుంటూరు, కృష్ణా జిల్లాలను కలుపుతూ వారధిని నిర్మిస్తామని వెల్లడించారు.