క్యాంపు కార్యాలయంలో స్పందనపై కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో సీఎం వైయస్.జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వాహించారు. ఈ కాన్ఫరెన్స్ లో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్తో పాటు, వివిధ శాఖల ఉన్నతా«ధికారులు హాజరయ్యారు.
వివిధ అంశాలను ప్రస్తావిస్తూ వీడియో కాన్ఫరెన్స్లో సీఎం ప్రస్తావించిన కీలక అంశాలు ఈ విధంగా ఉన్నాయి.
కరోనా వైరస్..పరీక్షల్లో మనేమే నెంబర్ వన్!
దేశంలోనే అత్యధికంగా 2,48,711 శాంపిళ్లు పరీక్షలు చేశామని ముఖ్యమంత్రి చెప్పారు.
- ప్రతి పదిలక్షల జనాభాకు 4840 మందికి పరీక్షలు చేశాం
- పరీక్షల్లో మనం (ఆంధ్రప్రదేశ్) నంబర్ ఒన్
- కరోనా వైరస్ నుంచి 1527 మంది పూర్తిగా రికవరీ అయ్యారు
- 705 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. (వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు)
- రాష్ట్రంలో 0.94 శాతం పాజిటివిటీ ఉంది
- 63.82 శాతం రికవరీ రేటు ఉంటోంది..
- 2.06 శాతం మరణాల రేటు.
ఈ డేటా అంతా చూశాక మనం కోవిడ్–19ను బాగానే నియంత్రించామని చెప్పగమని చెప్పిన జగన్ ఈ విషయంలో తన బలం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అని అన్నారు.
ఉత్తమ సామర్థ్యం ఉన్న వారిగా మిమ్మల్ని గుర్తించి బాధ్యతలు అప్పగించామని చెప్పారు. ''మీపై పూర్తి నమ్మకం, విశ్వాసం మీపై పెట్టాను:అందుకే మీరే మా బలమని చెప్తున్నాను:కలెక్టర్లు, ఎస్పీలు బాగా పరిపాలన చేస్తే.. ప్రభుత్వం కూడా బాగా పరిపాలన చేసినట్టే: మీరు కోవిడ్ –19 నివారణలో అద్భుతంగా పని చేశారు: గ్రామ వాలంటీర్, గ్రామ సచివాలయం, ఆశా వర్కర్లు, ఏఎన్ంలు, డాక్టర్ల దగ్గర నుంచి, కానిస్టేబుళ్లు, ఎస్సైలు, పారిశుద్ధ్య కార్మికులు అందరూ అద్భుతంగా పని చేశారు'' అని చెప్పారు.
ఇక కరోనా విషయంలో ఇప్పుడు ఏమి చేయాలనే దానిపై జగన్ ఈ విధంగా చెప్పారు..
'' మనం ఇప్పుడు నాలుగో విడత లాక్డౌన్లోకి అడుగుపెట్టాం. ఇంతకు ముందు మనం అనుసరించిన పద్దతి వేరు. ఇప్పుడు నాలుగో విడత లాక్డౌన్లో అనుసరిస్తున్న పద్దతి వేరు. ఈ విడతలో మనం ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించాల్సి ఉంటుంది. కోవిడ్ –19 నివారణపై దృష్టి కొనసాగిస్తూనే, మరోవైపు ఆర్థిక వ్యవస్థను ప్రారంభించాల్సిన అవసరం ఉంది'' అని జగన్ పేర్కొన్నారు.
ఎకానమీ పూర్తిగా ఓపెన్ కావాలి:
ఎకానమీ పూర్తిగా ఓపెన్ కావడంలో కలెక్టర్లు, ఎస్పీలు భాగస్వామ్యం కావాలని సీఎం చెప్పారు.
- షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, మతపరమైన కార్యక్రమాలు, సదస్సులు.. ఇవి తప్ప మిగిలిన చోట్ల కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకుని వాటిని ప్రారంభించాల్సి ఉంతున్దన్నారు.
- చిన్న చిన్న దుకాణాల దగ్గర నుంచి ప్రతీదీ కూడా ఓపెన్ చేయాలి.
- రాబోయే రెండు మూడు రోజుల్లో ప్రజా రవాణా కూడా ప్రారంభం అవుతుంది.
- ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేటు వాహనాలు ప్రారంభం అవుతాయి.
- ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి. ఈ రెండూ తప్పనిసరిగా పాటిస్తూ.. అన్నీ ఓపెన్ కావాలి. భయం తొలగాలి.
మనం కోవిడ్–19తో కలిసి జీవించాల్సి ఉంటుంది. కోవిడ్ –19 సోకిన వారిని వివక్షతో చూడడం అన్నది సమాజం నుంచి తొలగించాలి. ప్రజల్లో భయాందోళనలను పూర్తిగా తొలగించాలి. కోవిడ్ సోకిన వారిని వివక్షతతో చూడకూడదు. రాబోయే కాలంలో కోవిడ్ రాని వారు ఎవ్వరూ ఉండరేమో?. అది వస్తుంది.. పోతుంది కూడా. కోవిడ్ పట్ల భయాన్ని తొలగించాలి. ఈ వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని కలిగించాలి.
అదేవిధంగా..
ప్రజలు తమకు తాముగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకునేలా ముందుకు వచ్చేలా చూడాలి. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పే పరిస్థితి రావాలి. దీన్ని మనం ప్రోత్సహించాలి. పరీక్షల కోసం ఎవర్ని సంప్రదించాలి? ఎక్కడకు వెళ్లాలి? ఎలా పరీక్షలు చేయించుకోవాలన్నది ఎడ్యుకేట్ చేయాలి?పరీక్షల సదుపాయాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లకు దశా నిర్దేశం చేసారు.
ఈ ప్రక్రియలో ఇంకా రాబోయే రోజుల్లో వైయస్సార్ విలేజ్, వార్డు క్లినిక్స్ను తీసుకొస్తున్నామని చెప్పారు. వీటి నిర్మాణం కలెక్టర్ల ప్రథమ పనిగా భావించాలన్నారు. అనుమానం ఉన్న వారు అక్కడకు వెళ్లి.. పరీక్షలు చేయించుకుని మందులు తీసుకునే ప్రక్రియ చాలా సాఫీగా సాగిపోవాలి అని చెప్పారు.