ఏపీలో గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు వాయిదా!
ఏపీలో గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు వాయిదా! ఏపీలో గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు వాయిదా!
ఏపీలో అక్టోబర్, నవంబర్లలో జరగనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసింది appsc. ఈ మేరకు appsc కార్యదర్శి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా పరీక్షలను వాయిదా వేసినట్టు సమాచారం. తిరిగి ఎప్పుడు నిర్వహించేది ఈ నెల 22న ప్రకటన వెలువడనుంది. కాగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, గెజిటెడ్ పోస్టులు, నాన్ గెజిటెడ్ పోస్టులు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టుల పరీక్షలు వాయిదా పడ్డాయి.
మరోవైపు ప్రకాశం జిల్లాలో సచివాలయ పోస్టుల నియామకాలు తమ తుది తీర్పునకు లోబడి ఉంటాయని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. సచివాలయ పోస్టుల భర్తీ ప్రక్రియలో మెరిట్ అభ్యర్థులను ఓపెన్ కేటగిరీ పోస్టుల్లో నియమించలేదని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.