నేడు వైసీపీలోకి ప్రముఖ సినీనటుడు!

Update: 2019-03-13 01:44 GMT

వైసీపీలో సినీనటుల చేరిక క్రమంగా ఊపందుకుంటోంది. ఇప్పటికే పృథ్వి, కృష్ణుడు, భానుచందర్, జయసుధ, అలీ వంటి నటులు వైసీపీ తీర్ధం పుచ్చుకోగా తాజాగా నటుడు రాజారవీంద్ర ఇవాళ వైసీపీలో చేరేందుకు సిద్దమయినట్టు ప్రచారం జరుగుతోంది. 200 పైచిలుకు సినిమాల్లో నటించిన ఆయన రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారట. ఈ క్రమంలో వైసీపీ అయితే బావుంటుందని ఆయన భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదిలావుంటే నేడు ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్, కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఆయన సతీమణి వాణి తదితరులు వైసీపీలో చేరనున్నారు. 

Similar News