గుంటూరు జిల్లా మంగళగిరి తహశీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ కలకలం రేపింది. శివ కోటి అనేరైతు పెట్రోల్ బాటిల్తో కార్యాలయానికి వచ్చాడు. పట్టాదారు పాసుపుస్తకాలు జారీలో రెవిన్యూ సిబ్బంది అలసత్వం వహించడంతో మనస్థాపం చెందిన రైతు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు అడ్డుకోవడంతో ప్రమాదం జరిగింది. న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.