ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి మూడవ ఫేజ్ దరఖాస్తులు ఆగస్టు 1 నుంచి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 19 అని తెలిపింది. ఈ తేదీలు పొడిగించబోమని బోర్డు చెప్పింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, రెసిడెన్షియల్ కళాశాలకూ ఇది వర్తిస్తుందని పేర్కొంది.