ఆంధ్రప్రదేశ్ కు అవార్డుల పంట.. 14 జాతీయ పురస్కారాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవార్డుల పంట పండింది. 2019 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో ఏపీకి 14 జాతీయ పంచాయతీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవార్డుల పంట పండింది. 2019 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో ఏపీకి 14 జాతీయ పంచాయతీ పురస్కారాలు లభించాయి. దీంతో ఆయా విభాగాల ఉన్నధికారులు కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు.
బాల్య మిత్ర పంచాయతీ పురస్కారం నెల్లూరు జిల్లాలోని రాజువారి చింతలపాలెం గ్రామానికి వరించింది. గ్రామ పంచాయతీ వికాస్ యోజన అవార్డును ఏపీలోని చిత్తూరు జిల్లా కరకంబాడికి దక్కించుకుంది. నానాజీ దేవ్ ముఖ్ జాతీయ గౌరవ గ్రామ పుస్కారాన్ని శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం పంచాయతీకి దక్కింది.