Coronavirus Live Updates: కరోనా పై చైనా గెలుపు.. భారత్ లో కరోనా కట్టడికి ఏర్పాట్లు!
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడుతోంది. కరోనా పుట్టిల్లు చైనా పూర్తిగా కరోనాను తరిమి కొట్టినట్టు ప్రకటించింది. భారత దేశంలో కరోనా ఇప్పుడిప్పుడే ప్రతాపాన్ని చూపించడం ప్రారంభం అయింది. తెలంగాణలో నిన్న ఒక్క రోజే 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణా ప్రభుత్వం అలర్ట్ అయింది.
ఇప్పటి వరకూ ఉన్న కరోనా అప్ డేట్స్..
Live Updates
- 19 March 2020 6:47 PM IST
100 సంవత్సరాలకు ఒక అంటు వ్యాధి..
విశ్వాన్ని నాశనం చేయడానికి ప్రతి వంద ఏళ్లకు ఒక సారి ఏదో ఒక మహమ్మారి అవతారం ఎత్తుతూనే ఉంది. ఏదో ఒక అంటు వ్యాధి ప్రతి వంద ఏండ్లను ఒక సారి ప్రపంచంలోని సగం జనాభాను మట్టుపెడుతుంది. -పూర్తి కథనం
- 19 March 2020 6:00 PM IST
తిరుమలపై కరోనా ఎఫెక్ట్.. తిరుమల ఘాట్ రోడ్ మూసివేత
తిరుమలపై కరోనా ఎఫెక్ట్ పడింది. తిరుమల ఘాట్ రోడ్ మూసివేశారు. అలిపిరి టోల్గేట్ మూసివేసి వాహనాలను కొండపైకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.-పూర్తి కథనం
- 19 March 2020 5:30 PM IST
రామగుండం రైల్వే స్టేషన్లో ఇండోనేషియా దేశస్థులు.. సీసీ కెమెరాకు చిక్కిన దృశ్యాలు..
ఈ నెల 14న రామగుండం రైల్వే స్టేషన్ కు వచ్చిన ఇండోనేషియా దేశస్థుల దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. రైల్వే స్టేషన్ లో దిగి నడుస్తూ బయటకు వచ్చి అద్దె వాహనం మాట్లాడుతున్నారు.-పూర్తి కథనం
- 19 March 2020 5:23 PM IST
కరోనాపై తెలంగాణ పోలీస్ శాఖ అలర్ట్.. రాష్ట్రవ్యాప్తంగా 144వ సెక్షన్ విధించే యోచన
కరోనాపై తెలంగాణ పోలీస్ శాఖ అలర్ట్ అయింది. అన్నీ నగరాల కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో డీజీపీ మహేందర్ రెడ్డి సమావేశమయ్యారు.- పూర్తి కథనం
- 19 March 2020 4:33 PM IST
కరోనాపై ఏపీ సర్కార్ అప్రమత్తం.. రేపటి నుంచి హైఅలర్ట్ ప్రకటించే దిశగా..
కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. మరోవైపు అన్ని రాష్ట్రాల సీఎస్లతో పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. -పూర్తి కథనం
- 19 March 2020 3:50 PM IST
వస్తుందన్న భయం.. రాదన్న నిర్లక్ష్యం వద్దు : చిరంజీవి
కారోన వైరస్ పై అవగాహనా పెంచడానికి ఈ విషయని ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేందుకు సినీ స్టార్స్ కూడా తమ వంతు సహాయం చేస్తున్నారు. ఇందులో భాగంగా చిరంజీవి వీడియో చేసారు. -పూర్తి కథనం
- 19 March 2020 3:37 PM IST
కరోనాపై చైనా గెలుపు
కరోనాపై చైనా గెలిచింది మూడున్నర నెలలు కరోనాతో అల్లాడిన చైనాకు బిగ్ రిలీఫ్ దొరికింది. ఇవాళ ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని అధికారికంగా ప్రకటించింది. దేశంలోని ఏ పౌరుడికీ కరోనా పాజిటివ్ రాలేదని వెల్లడించింది. - పూర్తి కథనం




