తిరుమలపై కరోనా ఎఫెక్ట్.. తిరుమల ఘాట్ రోడ్ మూసివేత

Arun Chilukuri
Updated on: 19 March 2020 4:32 PM IST
తిరుమలపై కరోనా ఎఫెక్ట్.. తిరుమల ఘాట్ రోడ్ మూసివేత
X

తిరుమలపై కరోనా ఎఫెక్ట్ పడింది. తిరుమల ఘాట్ రోడ్ మూసివేశారు. అలిపిరి టోల్‌గేట్ మూసివేసి వాహనాలను కొండపైకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి తోడు తిరుమల శ్రీవారి ఆలయంలోకి భక్తుల ప్రవేశం నిలిపివేశారు. రేపు ఉదయం నుంచి రెండు ఘాట్ రోడ్డులు మూసివేయనున్నారు. ఈ సాయంత్రం నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేత.

ఏపీలో కరోనా కలకలం రేగింది. శ్రీవారిని దర్శంచుకునేందుకు వచ్చిన ఒక వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి దర్శించుకుని తిరుమలకు వచ్చిన భక్తుడు ఒక్కసారి కళ్లు తిరిగి పడిపోయాడు. అతడిని దామెదరంగా గుర్తించారు. వెంటనే అలర్ట్ అయిన తిరుమల సిబ్బంది వెంటనే స్థానికంగా ఉన్న అశ్విని ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి అనంతరం రుయా ఆస్పత్రికి తరలించారు. అతడికి కరోనా లక్షణాలు ఉన్నాట్లు వైద్యులు అనుమానిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story