Renigunta: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. రేణిగుంట రైల్వే అండర్ బ్రిడ్జి రెడీ!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట వాసులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది.
Renigunta: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. రేణిగుంట రైల్వే అండర్ బ్రిడ్జి రెడీ!
తిరుపతి జిల్లా: రేణిగుంటలో నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. ఏప్రిల్ 13న ప్రారంభమైన ఈ పనులను రైల్వే అధికారులు కేవలం నెల రోజుల వ్యవధిలోనే పూర్తి చేసి, మే 13న ఓపెన్ చేసేందుకు సిద్ధం చేశారు.ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు తలెత్తకుండా వేగంగా పనులు పూర్తి చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అండర్ బ్రిడ్జి ప్రారంభంతో రేణిగుంట పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు వాహనదారులకు సౌకర్యవంతమైన ప్రయాణం కలగనుంది.