Kamareddy: సోషల్ మీడియా ఉచ్చులో పడొద్దు.. లక్ష్యం దిశగా సాగాలి: పోలీసు కళాబృందం పిలుపు!

Kamareddy: మైనర్ బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలు, సైబర్ నేరాలు మరియు సోషల్ మీడియా మోసాలపై కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పోలీసు కళాబృందం సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది.

Update: 2026-03-17 06:58 GMT

Kamareddy: సోషల్ మీడియా ఉచ్చులో పడొద్దు.. లక్ష్యం దిశగా సాగాలి: పోలీసు కళాబృందం పిలుపు!

జుక్కల్ (కామారెడ్డి): మైనర్ బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలు, సైబర్ నేరాలు మరియు సోషల్ మీడియా మోసాలపై కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పోలీసు కళాబృందం సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. మద్నూర్ మండలం పెద్ద ఏక్లారాలోని బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల మరియు బిచ్కుంద బస్ స్టాండ్ ఆవరణలో ఈ కార్యక్రమాలు జరిగాయి.

సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా చైతన్యం:

పోలీసు కళాబృందం తమ ఆటపాటలు, మాటల ద్వారా మైనర్ బాలికలను ప్రేమ ఉచ్చులోకి దించి మోసం చేస్తున్న ఘటనలపై విద్యార్థినులను అప్రమత్తం చేశారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా పరిచయమయ్యే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, చిన్న పొరపాటు చేసినా జీవితాలు నాశనమవుతాయని హెచ్చరించారు. ప్రతి విద్యార్థిని చదువుపై దృష్టి సారించి తన లక్ష్యాన్ని చేరుకోవాలని కళాబృందం ఇంచార్జ్ హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి సూచించారు.

పోలీసు సేవలను వినియోగించుకోవాలి:

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వెంటనే డైల్ 100 సేవలను ఉపయోగించుకోవాలని బిచ్కుంద ఎస్సై జి. రాజు, మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డి కోరారు. అలాగే వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శుభకార్యాలకు ఇళ్లకు తాళాలు వేసి వెళ్తున్నప్పుడు పాటించాల్సిన భద్రతా నియమాలను ప్రజలకు వివరించారు. ఈ అవగాహన కార్యక్రమం స్థానికులను, విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో షీ టీమ్ సభ్యులు అనీల్, డబ్ల్యూపిసి పార్వతి, పోలీసు సిబ్బంది శేష రావు, సాయిలుతో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News