Donald Trump: మేమిద్దరం 'చేతల మనుషులం'.. ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసల జల్లు!

Donald Trump: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహబంధం మరోసారి ప్రపంచ వేదికపై చర్చనీయాంశమైంది.

Update: 2026-03-27 07:20 GMT

Donald Trump: మేమిద్దరం 'చేతల మనుషులం'.. ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసల జల్లు!

Donald Trump: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహబంధం మరోసారి ప్రపంచ వేదికపై చర్చనీయాంశమైంది. ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపిస్తూ.. "నేను, మోదీ ఇద్దరం చేతల మనుషులం (Men of Action). ఏదైనా పనిని కేవలం మాటల్లో చెప్పడం కాకుండా, చేసి చూపించడం మా నైజం" అని వ్యాఖ్యానించారు. ఈ మాట అందరికీ వర్తించదని అంటూనే, భారత్‌తో అమెరికా బంధం రానున్న రోజుల్లో మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత ఎంబసీ సోషల్ మీడియా పోస్ట్:

ట్రంప్ చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలను భారత్‌లోని యూఎస్ ఎంబసీ తమ అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ద్వారా పంచుకుంది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల నేతలు ఇలా ఒకరిపై ఒకరు విశ్వాసం ప్రకటించడం అంతర్జాతీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఫోన్ ద్వారా కీలక చర్చలు:

రెండు రోజుల క్రితం ప్రధాని మోదీకి ఫోన్ చేసిన ట్రంప్.. పశ్చిమాసియాలోని తాజా పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) తెరిచి ఉంచాల్సిన అవసరాన్ని ఇరువురు నేతలు నొక్కి చెప్పారు. దీనిపై భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ స్పందిస్తూ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అంతరాయం కలగకుండా చూడటమే ఇరువురు నేతల ప్రాధాన్యత అని పేర్కొన్నారు.

శాంతికి భారత్ మద్దతు:

ఈ ఫోన్ సంభాషణపై ప్రధాని మోదీ కూడా సానుకూలంగా స్పందించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను వీలైనంత త్వరగా తగ్గించి, శాంతిని పునరుద్ధరించడానికి భారత్ తన వంతు సహకారాన్ని అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం ఎవరికీ మేలు చేయదని, చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని మోదీ పునరుద్ఘాటించారు.

Tags:    

Similar News