Yemmiganur: ఇళ్లపై పడ్డ దొంగలు.. పిల్లల హుండీ కూడా వదల్లేదు!

Yemmiganur: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోటలో అర్ధరాత్రి ఘోర చోరీ జరిగింది.

Update: 2026-07-04 11:21 GMT

Yemmiganur: ఇళ్లపై పడ్డ దొంగలు.. పిల్లల హుండీ కూడా వదల్లేదు!

ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోటలో శివశంకర్ అనే వ్యక్తి ఓ ఇంట్లో చోరీ జరిగింది. అర్ధరాత్రి వచ్చిన దొంగలు ఇంట్లో చొరబడి ఒక తులం బంగారు,40 తులాల వెండి ఆభరణాలు.

50 వేల నగదు,పిల్లలు పొదుపు చేసుకొనే హుండీ దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇటీవల మండల పరిధిలోని గ్రామాల్లో వరుస చోరీలు ప్రజలను ఆందోళన కు గురిచేస్తున్నాయి. పోలీసులు రాత్రి పూట గ్రామాల్లో గస్తీ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News