Eluru: వేలేరుపాడులో అంగరంగ వైభవంగా భారీ 'తిరంగా ర్యాలీ'!
Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడులో 80వ స్వాతంత్ర్య దినోత్సవ ముందస్తు వేడుకల్లో భాగంగా భారీ 'తిరంగా ర్యాలీ'. తహశీల్దార్ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ.
Eluru: వేలేరుపాడులో అంగరంగ వైభవంగా భారీ 'తిరంగా ర్యాలీ'!
ఏలూరు: ఏలూరు జిల్లా వేలేరుపాడులో 80వ స్వాతంత్య్ర దినోత్సవ ముందస్తు వేడుకల్లో భాగంగా గురువారం రోజు భారీ 'తిరంగా ర్యాలీ' నిర్వహించారు. హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు జాతీయ జెండాలతో హై స్కూల్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ప్రదర్శన చేశారు.
తహశీల్దార్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ డిటి.సురేందర్ శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీహరి, ఎస్సై నవీన్ కుమార్. ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.