రేపు ప్రగతిభవన్ లో కేసీఆర్తో జగన్ భేటి
- విభజన అంశాలు, దేశ రాష్ర్టా రాజకీయాలపై చర్చ - ఎన్ఆర్సీతో పాటు పలు అంశాలపై చర్చించే అవకాశం
ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి సమావేశం కానున్నారు. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ ప్రగతి భవనలో ఇరువురు సీఎంలు భేటీ కాబోతున్నారు. రాష్ర్ట విభజన అంశాలతో పాటు దేశ రాజకీయాలపై చర్చించనున్నారు. అధికారులు లేకుండా కేవలం ఇరు రాష్ర్టాల సీఎంలు సమావేశం అవుతున్నారు. గోదావరి జలాల వినియోగంపైన దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చిన కేసీఆర్, జగన్ మధ్య ఎలాంటి సమావేశాలు జరగలేదు. ఆ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారమూ సాగింది. అయితే, ఇప్పుడు తిరిగి ఇద్దరు సీఎంల సమావేశం తో రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తి నెలకొని ఉంది