Telangana: టీ పొడి అనుకుని ఎండ్రిన్ వేశారు.. ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

Telangana: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపురంలోని ఓ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Update: 2021-03-31 13:28 GMT

Telangana: టీ పొడి అనుకుని ఎండ్రిన్ వేశారు.. ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

Telangana: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపురంలోని ఓ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టీ పొడి అనుకుని ఎండ్రీన్ గులికల మందుతో కుటుంబ సభ్యులు టీ కాచి సేవించారు. అయితే పాలలో టీ పొడి బదులు విషగుళికలు చేరడంతో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది.

బచ్చన్నపేట మండలానికి చెందిన దంపతులు అంజమ్మ, దాసారం మల్లయ్య, అంజమ్మ మరిది భిక్షపతి ఈ ఉదయం టీ తాగారు. అంజమ్మ టీ చేసే సమయంలో టీ పొడి అనుకొని పొరపాటున పాలలో విష గుళికలు వేశారు. టీ తాగిన 10 నిమిషాలకు ముగ్గురూ అస్వస్థతకు గురయ్యారు. వీరిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అంజమ్మ చనిపోయారు. మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు.

Tags:    

Similar News