Ponguleti Srinivasa Reddy: ధరణి పోర్టల్‌ను ప్రక్షాళన చేస్తాం

Ponguleti Srinivasa Reddy: తప్పు చేసినవారు ఎంతటివారైన వదిలిపెట్టం

Update: 2023-12-24 12:06 GMT

Ponguleti Srinivasa Reddy: ధరణి పోర్టల్‌ను ప్రక్షాళన చేస్తాం

Ponguleti Srinivasa Reddy: అధికారులు చిన్నచూపు చూడకుండా చిన్నగూడెం అయినా, చెంచు గూడెం అయినా ప్రజల వద్దకే వెళ్లి దరఖాస్తులు తీసుకుంటారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారని...పోర్టల్‌ను ప్రక్షాళన చేస్తామని మరోసారి ఉద్ఘాటించారు. గత ప్రభుత్వంలో ఉన్నవారు ప్రభుత్వ భూములను కబ్జాచేశారని, తప్పు చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమన్నారు మంత్రి పొంగులేటి. గత బీఆర్ఎస్ సర్కార్.. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందన్నారు. చేసిన అప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు పొంగులేటి.

Tags:    

Similar News