ప్రజా సమస్యలపై చర్చ జరగాలని కోరాం: నామా
ప్రజల సమస్యలపై చర్చ జరగాలని తాము అఖిలపక్ష సమావేశంలో కోరినట్టు చెప్పారు టీఆర్ఎస్ పార్లమెంటరీ
పార్లమెంటులో ప్రజల సమస్యలపై చర్చ జరగాలని తాము అఖిలపక్ష సమావేశంలో కోరినట్టు చెప్పారు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు. సమావేశాల్లో కేవలం బిల్లులు పాస్ చేసుకోవడమే కాకుండా దేశంలోని ముఖ్య అంశాలపై చర్చ జరగాలని సూచించినట్టు తెలిపారు. అలాగే, రాష్ట్ర విభజన చట్టంలోని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసిన రిజర్వేషన్, ఇతర అంశాలపై చర్చ జరగాలని, రాష్ట్ర విభజన అంశాలను నెరవేర్చాలని తాము డిమాండ్ చేసినట్టు చెప్పారు నామా.