చినజీయర్స్వామిపై కాంగ్రెస్ నేత వీహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నెలన్నర రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే చినజీయర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికే పాతిక మందికి పైగా కార్మికులు చనిపోయారన్న వీహెచ్ సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్కు సలహా ఇవ్వాలని చినజీయర్కు సూచించారు.