DGP Mahender Reddy: లాక్‌డౌన్‌లో సీజ్‌ అయిన వెహికిల్స్‌ విడుదలకు రంగం సిద్ధం

DGP Mahender Reddy: లాక్‌డౌన్‌లో సీజ్‌ అయిన వెహికిల్స్‌ విడుదలకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.

Update: 2021-06-22 07:56 GMT

డీజీపీ మహేందర్ రెడ్డి(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

DGP Mahender Reddy: లాక్‌డౌన్‌లో సీజ్‌ అయిన వెహికిల్స్‌ విడుదలకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. సీజ్‌ అయిన వాహనాలను తీసుకెళ్లొచ్చని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఫైన్స్ చెల్లించిన వారికే వెహికిల్స్ ఇవ్వాలని ఎస్పీ, కమిషనరేట్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈపెట్టీ, ఈ చలనాల ద్వారా పోలీస్‌స్టేషన్లలో జరిమానాలు చెల్లించుకునే వెసలుబాటు కల్పించారు. అయితే తీవ్ర కేసులను కోర్టుకు పంపాలని పోలీసులను డీజీపీ ఆదేశించారు. అలాంటి వాహనదారులకు కోర్టులో జరిమానాలు చెల్లించాలన్నారు. లేదంటే ప్రొసీడింగ్‌ ప్రకారం శిక్ష ఖరారు చేస్తారని మహేందర్ రెడ్డి తెలిపారు.

Full View


Tags:    

Similar News