నోట్లరద్దు , జీఎస్టీ అమలు దేశ ప్రగతిని దెబ్బతీశాయి-ఉత్తమ్
నోట్లరద్దు , జీఎస్టీ అమలు దేశ ప్రగతిని దెబ్బతీశాయన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి.
నోట్లరద్దు , జీఎస్టీ అమలు దేశ ప్రగతిని దెబ్బతీశాయన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతల సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. మోడీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఈనెల 25 వరకు అన్ని రాష్ట్రాల్లో భారత్ బచావ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 30న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ బచావ్ ర్యాలీని కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.