విషాదం : ఇద్దరు యువతుల ఆత్మహత్య..పక్కనే చిన్నారి మృతదేహం

Update: 2020-04-13 04:54 GMT

మేడ్చల్‌ జిల్లాలోని జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డెంటల్ కాలేజ్ డంపింగ్ యార్డ్ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని ఇద్దరు యువతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఇద్దరు యువతులు పక్కనే వేర్వేరు చెట్లకు ఉరేసుకోవడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలిలో ఓ చిన్నారి మృతదేహం కూడా ఉంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు.. ఏ కారణంతో చనిపోయారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.


Tags:    

Similar News