జగన్‌ కేసు: ఇద్దరు ఐఏఎస్‌లకు ఊరట..

Update: 2019-01-22 02:37 GMT

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు ఊరట లభించింది. ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, ఆదిత్య నాథ్‌దాస్‌ లపై ఈడీ కేసులు కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు. అయితే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) గడువు కోరగా.. నాలుగు వారాలు తీర్పు అమలు నిలిపి వేసేందుకు హైకోర్టు అంగీకరించింది. ఈ ఇద్దరు ఐఏఎస్‌ అధికారులపై ప్రాసిక్యూషన్ కు అనుమతి తీసుకోకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

Similar News