షామీర్పేట్ లో ఘోర రోడ్డు ప్రమాదంలో : ఇద్దరు మృతి
షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తుర్కపల్లి గ్రామానికి సమీపంలో సిద్దిపేట రోడ్డులో ఈ సంఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను గాంధీ హాస్పిటల్ మార్చురీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.