షామీర్‌పేట్ లో ఘోర రోడ్డు ప్రమాదంలో : ఇద్దరు మృతి

షామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

Update: 2019-10-22 05:11 GMT

షామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తుర్కపల్లి గ్రామానికి సమీపంలో సిద్దిపేట రోడ్డులో ఈ సంఘటన జరిగింది.

ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను గాంధీ హాస్పిటల్ మార్చురీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.



Tags:    

Similar News