సంక్రాంతి పండగ ప్రయాణుల రద్దీ దృష్ట్యా అదనపు బస్సులు నడిపేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్దమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ ఘనంగా నిర్వహింస్తారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సొంత ఊర్లకు చేరుకునే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోనుంది. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్యాలయంలో అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సంక్రాంతి సందర్భంగా 4,940 అదనపు బస్సులను సిద్ధం చేసినట్లు తెలిపారు. తెలంగాణకు 3,413 బస్సులను కేటాయింస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆంధ్ర ప్రాంతానికి 1,526 బస్సులను అదనంగా కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఇక అదనపు బస్సులను జనవరి 9వ తేది నుంచి జనవరి 13 వరకునడుపుతున్నట్లు వెల్లడించారు. అలాగే సొంత ఊర్ల నుంచి తిరిగి వచ్చే వారి కోసం జనవరి 17న నుంచి అదనపు బస్సలు నడుపుతుట్ల వెల్లడించారు.