తెలంగాణా ప్రభుత్వ పథకాలనే కేంద్రం కాపీ కొడుతుంది : కేటీఆర్

లంగాణా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పధకాలనే కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతుందని అయన వాఖ్యానించారు .

Update: 2019-08-19 09:35 GMT

తెలంగాణా రాష్ట్రంలో పాగా వేసుకుందుకు బీజేపీ నడుం బిగించింది. అందులో భాగంగానే నిన్న హైదరాబాదులో భారీ బహిరంగసభని ఏర్పాటు చేసింది . కేంద్రమాజీ మంత్రి మరియు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్‌ ప్రకాశ్ నడ్డా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసారు . అయితే అయన చేసిన వాఖ్యాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ వేసారు . తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పధకాలనే కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతుందని అయన వాఖ్యానించారు . జేపీ నడ్డా కాదు పచ్చి అబద్దాల అడ్డా అని ఆయన పేర్కొన్నారు . రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడైనా రెండు  వెయిల ఫించిన్ ఇస్తుందా అని ప్రశ్నించారు .. గత ఎన్నికల్లో మోడీతో సహా బీజేపీ నేతలు అందరు కలిసి వచ్చి ప్రచారం చేసిన వారు గెలిచినా అసెంబ్లీ స్థానాలు ఎన్నో గుర్తుకు తెచ్చుకోవాలని అయన అన్నారు . కూకట్‌పల్లిలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News