Modi Tour: ఇంట్రెస్టింగ్గా మారుతున్న ఇద్దరి సీఎంల వ్యూహాలు..
* ఇప్పటికే మూడుసార్లు పీఎం టూర్కు దూరంగా కేసీఆర్
Modi Tour: ఇంట్రెస్టింగ్గా మారుతున్న ఇద్దరి సీఎంల వ్యూహాలు..
KCR Vs MODI: ఏపీలో దోస్తీ తెలంగాణలో కుస్తీ అన్నట్లుగా మోడీతో తెలుగు రాష్ట్రాల సీఎంలు వ్యవహరిస్తుండటం హాట్ టాపిక్గా మారుతోంది. ఏపీలో మోడీకి జగన్ ఘన స్వాగతం పలికారు. భారీ బహిరంగ సభకు జనాన్ని సమీకరించారు. బీజేపీకి పోటీగా సభను సక్సెస్ చేసేందుకు శ్రమించారు. కానీ తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ మోడీని ఢీ కొడుతున్నారు. బీజేపీతో యుద్ధమేనని స్పష్టమైన సంకేతాలిస్తున్నారు. ఉపఎన్నికలతో పాటు అనేక అంశాల్లో టీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని భావిస్తున్న కేసీఆర్ తాను కూడా అదే వైఖరి కొనసాగిస్తున్నారు. బీజేపీకి ధీటుగా జాతీయ పార్టీతో దూసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంల డిఫరెంట్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు.