నేడు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్నది. ప్రగతి భవన్లో నేటి భేటీ మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సమావేశంలో ఈనెల 17నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. చర్చించనున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారిగా జరుగుతున్న ఈ సమావేశంలో పార్టీ లోక్సభాపక్ష నేతపైనా నిర్ణయం తీసుకునే అవకాశమున్నది. భేటీకి హాజరుకావాలంటూ లోక్సభ, రాజ్యసభ సభ్యులకు పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్ పార్లమెంట్ వ్యూహాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి 9 మంది గెలువగా ఆరుగురు రాజ్యసభ సభ్యులు కలిపి మొత్తం 15 మంది ఎంపీలు సమావేశానికి హాజరుకానున్నారు.