నిధులు విడుదల చేయడంలో కేంద్రం నిర్లక్ష్యం : నామా

కేంద్రం నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు.

Update: 2019-11-15 15:07 GMT
Nama nageshwar rao

మిషన్‌ భగీరథను ఓ వైపు కేంద్ర మంత్రులు అభినందిస్తున్నా కేంద్రం నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు.కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వద్దన్న ఏపీ ప్రభుత్వ అఫిడవిట్‌పై సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని, అయితే, ఏపీ అఫిడవిట్, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై పార్టీ స్పందిస్తుందని ఆయన చెప్పారు. బయ్యారంతోపాటు 30 అంశాల మీద చర్చించామన్నారు. పార్లమెంటు సమావేశాల్లో విభజన హామీలపై పట్టుబడతామన్నారు. తెలంగాణ హక్కుల సాధన దిశలో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు నామా.

Keywords  TRS parliamentary party leader, Nama Nageswara Rao, central government, releasing funds

Tags:    

Similar News