ఏపీ, తెలంగాణలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ, మధ్య మహారాష్ట్ర, గోవా, కొంకణ్, తూర్పు ఉత్తరప్రదేశ్, మరఠ్వాడ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బీహార్, అసోం, ఒడిశా, మేఘాలయ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. జూన్, జులైతో పోలిస్తే సెప్టెంబర్ మాసంలోనే ఎక్కువ వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.