భర్తపై దాడి చేసి భార్యను ఎత్తుకెళ్లిన దుండగులు
Bhadradri Kothagudem: తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
భర్తపై దాడి చేసి భార్యను ఎత్తుకెళ్లిన దుండగులు
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కిడ్నాప్ కలకలం రేగింది. భర్తపై దాడి చేసి భార్యను ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇటీవలే సన్నీ, మాధవి ప్రేమ వివాహం చేసుకోగా.. తన భార్యను ఖమ్మం నుంచి కొత్తగూడెంకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆటోకు అడ్డుపడ్డారు. భర్తపై దాడి చేసి భార్యను లాక్కెళ్లారు. కులాంతర వివాహం చేసుకున్నామనే కారణంతోనే.. తనపై దాడి చేసి తన భార్యను ఎత్తుకెళ్లారని ఆరోపిస్తున్నారు సన్నీ. తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించాడు.