గ్రూప్-1 ఫలితాలు సోమవారం వరకు ప్రకటించొద్దని హైకోర్టు ఆదేశం
TSPSC Group 1 Results: గ్రూప్-1 పరీక్షలో బయోమెట్రిక్ పెట్టలేదని NSUI పిటిషన్ దాఖలు
గ్రూప్-1 ఫలితాలు సోమవారం వరకు ప్రకటించొద్దని హైకోర్టు ఆదేశం
TSPSC Group 1 Results: గ్రూప్ - 1 పరీక్షల ఫలితాలు సోమవారం వరకు ప్రకటించ వద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. గ్రూప్ -1 పరీక్షకు సంబంధించి NSUIతో పాటు పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్-1 పరీక్షలో బయోమెట్రిక్ పెట్టలేదని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. త్వరలో గ్రూప్ - 1 ఫలితాలు ప్రకటించేందుకు TSPSC యోచిస్తోందని కోర్టుకు పిటిషనర్లు తెలిపారు.
ఫలితాలు ప్రకటించకుండా స్టే విధించాలని కోరారు. ఈ పిటిషన్పై సోమవారం అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారని కోర్టుకు ఏజీపీ తెలిపారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. తదుపరి విచారణ జరిగే వరకు గ్రూప్ - 1 ఫలితాలు ప్రకటించవద్దని హైకోర్ట్ ఓరల్ ఆర్డర్ జారీ చేసింది.