Kodandaram: నా ఎమ్మెల్సీ పదవిపై వివాదం సరికాదు
Kodandaram: రాజ్యాంగపరంగా సేవ చేసిన వారికి అవకాశం ఇస్తారు
Kodandaram: నా ఎమ్మెల్సీ పదవిపై వివాదం సరికాదు
Kodandaram: తన ఎమ్మెల్సీ పదవిపై వివాదం సరికాదన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్.గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాంతో పాటు అమీర్ అలీఖాన్ సోమవారం ప్రమాణం చేయాలనుకున్నారు. అయితే శాసనమండలికి వెళ్లిన వారికి నిరాశ ఎదురైంది. రెండు గంటలపాటు కౌన్సిల్ హాల్లో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కోసం వాళ్లు ఎదురు చూశారు. అయితే అయినప్పటికీ ఆయన రాలేదు. అయితే మంగళవారం మండలి చైర్మన్ అందుబాటులో ఉంటారనే సమాచారం వాళ్లకు అందడంతో వెనుదిరిగారు. మంగళవారం ఉదయం 9గంటల 30 నిమిషాలకు ఈ ఇద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయనున్నారు.