బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు వివాదాస్పదం.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు..

Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Update: 2022-03-20 09:46 GMT

బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు వివాదాస్పదం.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు..

Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శివాజీ విగ్రహం ఏర్పాటు రెండు వర్గాల మధ్య అగ్గి రాజేసింది. అంబేద్కర్ చౌరస్తా దగ్గర శివసేన ఆధ్వర్యంలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం తొలగించాలని మరో వర్గం నేతలు డిమాండ్ చేశారు. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీ ఛార్జ్ చేశారు. బోధన్‌లో 144 సెక్షన్ అమలులో ఉందన్నారు పోలీస్ కమిషనర్ నాగరాజు. శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేదన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తే సహించమన్నారు.

Tags:    

Similar News