Hyderabad: హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లో ఉద్రిక్తత.. అక్రమ నిర్మాణాల కూల్చివేత

Hyderabad: కోర్టు ఆదేశాలతోనే కూల్చివేస్తున్నామంటున్న అధికారులు

Update: 2023-02-14 04:40 GMT

Hyderabad: హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లో ఉద్రిక్తత.. అక్రమ నిర్మాణాల కూల్చివేత

Hyderabad: హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏసీ గార్డ్స్‌లో అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. బెస్తవాడ బస్తీవాసులను ఖాళీ చేయిస్తుండటంతో అధికారులతో బస్తీవాసులు వాగ్వాదానికి దిగారు. కోర్టు ఆదేశాలతోనే కూల్చివేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులను బస్తీవాసులు అడ్డుకుంటుండడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జగరకుండా భారీగా పోలీసులు మోహరించారు. 

Tags:    

Similar News