నాకు వెన్నుపోటు పొడిచిందెవరో తెలుసు

తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2020-01-01 16:25 GMT
Etela Rajender

తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపాల్ ఎన్నికల్లు సమీపిస్తు్న్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు చేయడంపై సర్వాత్ర ఆసక్తి నెలకొని ఉంది. ముందు బాటీళ్లు ఇస్తే ఓట్లు రాలవని వ్యాఖ్యానించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలంలోని శాలపల్లి, హుజూరాబాద్‌, జమ్మికుంట మున్సిపాలిటీల టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తన వెంట ఉండి కొందరు వెన్నుపోటు పొడిచారని, వెన్నుపోటు దారులేవరో తనకు బాగాతెలుసని మంత్రి ఈటల వ్యాఖ్యానించారు.

కాగా.. హుజూరాబాద్‌, జమ్మికుంట చెరో 30 మున్సిపాల్టీలు ఉన్నాయని.. ఈ మున్సిపాలిటీల్లో త్వరలోనే కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. పార్టీకోసం ప్రతి ఒక్కరు కలిసి పనిచేయాని కోరారు. వచ్చే మున్సిపాల్ ఎన్నికల్లో విజయం దిశగా అందూ పనిచేయాని సూచించారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలవడం కంటే మున్సి పాల్ ఎన్నికల్లో గెలవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒకలా ఉంటుందని, ఎన్నికల్లో డబ్బు ఉంటేనే పార్టీ టికెట్ రాదని ప్రజలకు ప్రేమ ఆదరణ ఉంటేనే వస్తుదని తెలిపారు.

ఎమ్మెల్యే , ఎంపీ కంటే కౌన్సిలర్ గెలుపు చాలా కష్టమని తెలిపారు. పార్టీలోకి వచ్చినప్పుడు తన కంటే ముందు 27 మంది సీట్లు ఆశించారని కానీ, చివరి క్షణంలో తనను వరించిందని గుర్తుచేశారు. కొందరు ఎన్నికల ముందు ఒక రకంగా ఎన్నికల తర్వాత ఒక రకంగా ఉంటారని, క్యాంపు రాజకీయాలు తనకు చేతకాదని వ్యాఖ్యానించారు.

  

Tags:    

Similar News