తెలంగాణ శాసనమండలి చైర్మన్ గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డిని సీఎం కేసీఆర్ నియమించే అవకాశం కనిపిస్తోంది. ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని అందరూ భావించారు కానీ కొన్ని సమీకరణాల వలన సాధ్యపడలేదు.. దీంతో ఆయనను మండలి చైర్మన్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. రేపు(సోమవారం) సాయంత్రం ఆయన నామినేషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది.