Telangana: మరో ఘనత సాధించిన తెలంగాణ రాష్ట్రం

Update: 2021-03-08 10:42 GMT

మరో ఘనత సాధించిన తెలంగాణ రాష్ట్రం

Telangana: దేశంలో అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించింది. ఈ విషయాన్ని కేంద్ర అటవీశాఖ మంత్రి బాబుల్ సుప్రియో అధికారికంగా ప్రకటించారు. ఇవాళ రాజ్యసభలో కాంగ్రెస్‌ నేత జీ.సీ చంద్రశేఖర్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి బాబుల్ సుప్రయో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 20 సూత్రాల కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా 150.23 కోట్ల మొక్కలు నాటితే 2019-20లో ఒక్క తెలంగాణలోనే 38.17 కోట్ల మొక్కలు నాటారని వెల్లడించారు.

దేశంలోనే అత్యధిక మొక్కలు నాటిన రాష్ర్టంగా తెలంగాణ రాష్ర్ట రికార్డు సాధించడం పట్ల రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరిత హారం కార్యక్రమం వల్లే తెలంగాణకు ఈ ఘనత లభించిందన్నారు. సీఎం కేసీఆర్ ట్విట్టర్ ద్వారా సంతోష్ కుమార్ కు అభినందనలు తెలిపారు. 


Tags:    

Similar News