తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

Update: 2020-03-11 08:02 GMT
సీఎం కేసీఆర్

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. సమ్మె కాలానికి సంబంధించి జీతాలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మె కాలానికి సంబంధించి 235కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారి చేసింది. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు 52 రోజుల పాటు సమ్మె చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆ సమ్మె కాలపు కార్మికుల జీతాలను విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని వారు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Tags:    

Similar News