అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడిన ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడికి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
నాగర్కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం పెద్దూరుకు చెందిన శరత్ వనపర్తి జిల్లా ఏదుట్లలో నివసిస్తున్నాడు. అక్కడే ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. గురుకుల ప్రవేశం కోసం 4వ తరగతి విద్యార్థులకు శిక్షణ ఇచ్చేవాడు. సలహాలు అడిగితే ఇంటికి పిలిచి అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆరోపిస్తున్నారు. విషయం ఎవరికీ చెప్పవద్దని భయపెట్టేవాడని చెబుతున్నారు. ఓ బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో నిందితుడు శరత్ను గ్రామస్తులు చితకబాదారు. అనంతరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.