ఇవాళ బీజేపీలో చేరనున్న ఇద్దరు టీడీపీ నేతలు
ఇవాళ బీజేపీలో చేరనున్న ఇద్దరు టీడీపీ నేతలు ఇవాళ బీజేపీలో చేరనున్న ఇద్దరు టీడీపీ నేతలు
టీడీపీకి చెందిన ఇద్దరు కీలకనేతలు ఇవాళ(బుధవారం) బీజేపీలో చేరనున్నారు. టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి, రవీంద్రనాయక్ లు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. చేరికలపై అధిష్టానంతో చర్చించేందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కీలక నేతలు, సిట్టింగ్లు, మాజీలు ఆయా పార్టీలకు గుడ్ బై చెప్పేసి కాషాయ కండువా కప్పుకున్నారు. ఇక టీడీపీలో ఓ వెలుగు వెలిగిన రేవూరి ప్రకాష్రెడ్డి, రవీంద్రనాయక్ ఇద్దరూ పార్టీని వీడుతుండడంతో టీడీపీ మరింత కష్టాల్లో కూరుకుపోయినట్టైంది.