టీడీపీకి మరో ఊహించని షాక్..

టీడీపీకి మరో ఊహించని షాక్.. టీడీపీకి మరో ఊహించని షాక్.. టీడీపీకి మరో ఊహించని షాక్..

Update: 2019-08-26 01:47 GMT

ఎన్నికల తరువాత టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇటీవల చాలా మంది పెద్ద లీడర్లు బీజేపీలో చేరిపోగా తాజాగా మరో బడానేత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఆయనే రేవూరి ప్రకాష్ రెడ్డి. మూడుసార్లు వరంగల్ జిల్లా నర్సంపేట్ అసెంబ్లీ నియోజకవర్గంనుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన.. గతంలో కీలక పదవుల్లో పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పీఏసీ ఛైర్మెన్ గా పనిచేశారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంత్రి అమిత్ షాను కలిసేందుకు రేవూరి ప్రయత్నం చేయగా.. అదే రోజు కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ హఠాన్మరణంతో.. కార్యక్రమాలన్నింటిని రద్దు చేసుకున్నారు. దీంతో షా-రేవూరి భేటీకీ వీలుకాలేదు.

Tags:    

Similar News