దిశ ఎన్ కౌంటర్ కేసుపై రేపు సుప్రీంకోర్టు కీలక తీర్పు

Disha Encounter: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఎన్ కౌంటర్‌‌పై రేపు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది.

Update: 2022-05-19 09:11 GMT

దిశ ఎన్ కౌంటర్ కేసుపై రేపు సుప్రీంకోర్టు కీలక తీర్పు 

Disha Encounter: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఎన్ కౌంటర్‌‌పై రేపు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. 2019 డిసెంబరు 6న నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌తో దేశవ్యాప్తంగా అలజడి రేగింది. ఎన్‌కౌంటర్ ఫేక్ అంటూ దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయ్. కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఎన్‌కౌంటర్ తర్వాత మొత్తం వ్యవహారంపై సుప్రీం కోర్టు సిర్పూర్కర్, రేఖ ప్రకాశ్, కార్తికేయన్‌లతో త్రిసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. దాదాపు మూడేళ్లపాటు విచారణ సాగింది. తెలంగాణ హైకోర్టు వేదికగా కమిషన్ విచారణ జరిపింది. ఇటీవల విచారణ పూర్తి చేసి కమిషన్ నివేదకను సుప్రీంకోర్టు‌కు సమర్పించింది. సంచలనం సృష్టించిన ఎన్‌కౌంటర్‌‌పై రేపు సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వనుంది. రేపటి విచారణకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హాజరుకానున్నారు.

Tags:    

Similar News