Supreme Court: కృష్ణా ట్రిబ్యున‌ల్‌పై తెలంగాణ పిటిష‌న్ ఉప‌సంహ‌ర‌ణ‌కు అనుమ‌తి

Supreme Court: కృష్ణా ట్రిబ్యునల్ నియామకంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.

Update: 2021-10-06 15:45 GMT

Supreme Court: కృష్ణా ట్రిబ్యున‌ల్‌పై తెలంగాణ పిటిష‌న్ ఉప‌సంహ‌ర‌ణ‌కు అనుమ‌తి

Supreme Court: కృష్ణా ట్రిబ్యునల్ నియామకంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కృష్ణా జలాల పంపకంపై కొత్త ట్రిబ్యునల్ కోరుతూ గతంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్ ఉపసంహరణపై ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ట్రిబ్యునల్ ఏర్పాటుపై ప్రస్తుతం ఆదేశాలు ఇవ్వట్లేదని సుప్రీంకోర్టు తెలిపింది.

అభ్యంతరాల దాఖలుకు ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు అవకాశం కోరాయి. దీంతో అభ్యంతరాలు దాఖలుకు ఆ రెండు రాష్ట్రాలకు కోర్టు అనుమతి ఇచ్చింది. పిటిషన్ ఉపసంహరించుకుంటే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు పరిశీలిస్తామని కేంద్రం తెలిపింది. కేంద్రం సూచనతో పిటిషన్ ఉపసంహరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరింది. దీంతో త్రిసభ్య ధర్మాసనం పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇచ్చింది. 

Tags:    

Similar News