ఆర్టీసీ కార్మికుల మరణాలను ఆపడానికే సమ్మె విరమణ -భట్టి విక్రమార్క
ఆర్టీసీ కార్మికుల మరణాలను ఆపడానికి జేఏసీ సమ్మె విరమణ చేసారని కాంగ్రెస్ భావిస్తుందన్నారు సీఎల్పీ నేత
ఆర్టీసీ కార్మికుల మరణాలను ఆపడానికి జేఏసీ సమ్మె విరమణ చేసారని కాంగ్రెస్ భావిస్తుందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం.. కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. కార్మికుల సమ్మె చరిత్రలో నిలిచిపోతుందని, హైకోర్టు తీర్పు.. ప్రభుత్వ మూర్ఖపు విధానంతోనే ఆర్టీసీ కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నారని భట్టి విక్రమార్క అన్నారు.