రాజ్‌భవన్‌లో బోనాల ప్రత్యేక పూజలు... అమ్మవారికి బోనం సమర్పించిన గవర్నర్...

Raj Bhavan: రాష్ట్రప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపిన తమిళిసై

Update: 2022-07-23 09:42 GMT

రాజ్‌భవన్‌లో బోనాల ప్రత్యేక పూజలు... అమ్మవారికి బోనం సమర్పించిన గవర్నర్...

Raj Bhavan: రాజ్ భవన్ ప్రాంగణంలోని ఆలయంలో అమ్మవారికి 'బోనాలు' సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు గవర్నర్ తమిలిసై సౌందరరాజన్. రాష్ట్ర ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారన్న గవర్నర్ బోనాల పండుగ వెనుక ఎంతో చరిత్ర ఉందన్నారు. ఆషాడ, శ్రావణ మాసాల్లో బోనాల పండుగను తెలంగాణ ప్రజలు ఎంతో భక్తితో నిర్వహిస్తారని తెలిపారు. అమ్మవారి దయవల్ల సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానని తెలిపారు.

Tags:    

Similar News