తెలంగాణలో ఆరుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు
తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆరుగురు ఐపీఎస్ అధికారులను ప్రమోషన్స్ వరించాయి.
తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆరుగురు ఐపీఎస్ అధికారులను ప్రమోషన్స్ వరించాయి. ఆరుగురు అధికారులు సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించిన ప్రభుత్వం వారికి పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. పదోన్నతులు పొందినవారిలో 2006 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారులు కార్తికేయ, రమేశ్ నాయుడు, సత్యనారాయణ, సుమతి, శ్రీనివాసులు, వెంకటేశ్వరరావు వున్నారు. వీరందరికీ డీఐజీ(డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్)లుగా పదోన్నతి లభించింది.
♦ డీఐజీ స్థాయిలో రామగుండం పోలీసు కమిషనర్గా సత్యనారాయణ పదోన్నతి పొందారు.
♦ సీఐడీ డీఐజీగా సుమతికి పదోన్నతి పొందారు.
♦ డీఐజీ స్థాయిలో పోలీసు అకాడమీ ఉపసంచాలకులుగా రమేశ్ నాయుడు పదోన్నతి పొందారు.
♦ సీఐడీ డీఐజీగా శ్రీనివాసులు పదోన్నతి పొందారు.
♦ సైబరాబాద్ సంయుక్త సీపీగా వెంకటేశ్వరరావు పదోన్నతి పొందారు.
♦ డీఐజీ స్థాయిలో నిజామాబాద్ పోలీసు కమిషనర్గా కార్తికేయ పదోన్నతి పొందారు.